(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానానికి పరిమితమైన భారత్.. మెర్సర్ సీఎఫ్ఎస్ అంతర్జాతీయ పింఛన్ సూచీ-2022లోనూ అట్టడుగు స్థానంలో నిలిచింది. 44 దేశాలకు గానూ ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 41వ స్థానానికి (44.4 మార్కులతో) పరిమితమవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. అసంఘటిత రంగంలోని కార్మికులు, ప్రైవేటు సెక్టార్లోని ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉన్నదని నివేదిక నొక్కి చెప్పింది.
ఇండెక్స్ విలువ ఏం చెప్తున్నది?
80 కంటే ఎక్కువ మార్కులు: ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అత్యుత్తమ పింఛన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇది ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉన్నది.
35-50: ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ బలహీనంగా ఉన్నది. పెన్షన్ సిస్టమ్లో సవరణలు అవసరం.