రాజన్న సిరిసిల్ల, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మరమగ్గాల వస్త్ర పరిశ్రమ ఈ నెల 6నుంచి తలపెట్టిన నిరవధిక బంద్ను విజయవంతం చేయాలని లాల్బావుటా చేనేత పవర్లూం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పంతం రవి పిలుపునిచ్చారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో బంద్కు సంబంధించిన వాల్పోస్టర్లను ఆదివారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశ్రమకు రావాల్సిన రూ.270 కోట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.
కార్మికులను యజమానులుగా చేస్తామన్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని అన్నారు. కార్మికులకు చేతినిండా పని ఉండాలంటే ఎప్పటిలాగే వస్త్ర ఆర్డర్లు సిరిసిల్లకు ఇవ్వడంతోపాటు యారన్ సబ్సిడీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6 నుంచి చేపడుతున్న నిరవధిక బంద్ను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు అజ్జ వేణు, సీనియర్ నాయకులు నల్ల చంద్రమౌళి, నల్ల మార్కండేయులు, కొంక విజయ్, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.