గత కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 250 వికెట్ల మైలురాయికి ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 34ఏండ్ల అశ్విన్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు 155 మ్యాచ్ల్లో 139 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున 46 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు. మిగిలిన వికెట్లను దేశవాళీ క్రికెట్లో తీశాడు.
ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన 4/34 కాగా, ఇంటర్నేషనల్ క్రికెట్లో 4/8తో అగ్రశ్రేణి బౌలర్లలో
ఒకడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆరో స్థానంలో ఉన్నాడు. వెటరన్ పేసర్ లసిత్ మలింగ 170 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అమిత్ మిశ్రా(160), పియూశ్ చావ్లా(156), డ్వేన్ బ్రావో(154), హర్భజన్సింగ్(150) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2021లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 250 ఫీట్
అందుకోవాలని అశ్విన్ ఆసక్తిగాఎదురుచూస్తున్నాడు.