హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూగర్భ జల సిరులు పైపైకి ఎగిసి వస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకంతో దాదాపు 20 జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం భారీగా పెరిగిందనని ప్రభుత్వం విడుదల చేసిన నెలవారీ నివేదికలో వెల్లడైంది. కొన్నేండ్లుగా వర్షాలు కూడా పుష్కలంగా కురుస్తుండటంతో జల సిరులు పొంగుతున్నాయి. సిరిసిల్లలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 71 శాతం, సిద్దిపేటలో 66 శాతం, నారాయణపేటలో 60 శాతం, హనుమకొండలో 60 ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కొన్నేండ్లుగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లానే లేదు.