హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరంలో పదోతరగతి ఇంగ్లిష్ మీడియం పుస్తకాల బరువు తగ్గనున్నది. ప్రస్తుతం 4.5 కిలోలున్న ఈ పుస్తకాల బరువు 3.5 కిలోలు కానున్నది. ఇదే తరహాలో 1 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల బరువు కిలో చొప్పున తగ్గనున్నది. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పేపర్ సైజును 90 జీఎస్ఎం (గ్రామ్స్ ఫర్ స్కేర్ మీటర్) నుంచి 70 జీఎంఎస్కు తగ్గించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై ప్రభుత్వ అనుమతి కోరింది. ఆయా ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందుకు అనుమతించడం లాంఛనమే కానున్నది. కొత్తగా పుస్తకాలను 70 జీఎస్ఎం పేపర్తో ముద్రిస్తారు. దీంతో బడి సంచి బరువు 30 నుంచి 25శాతం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు.
3 వేల టన్నులు తగ్గనున్న భారం
పేపర్ సైజు కుదింపుతో కొనుగోలు చేయాల్సిన పేపర్ 3వేల టన్నులు తగ్గనున్నది. 90 జీఎస్ఎం పేపర్తో ఏటా 11,700 టన్నుల పేపర్ను విద్యాశాఖ సేకరిస్తున్నది. ప్రస్తుతం 70 జీఎస్ఎంకు తగ్గించడంతో 8 వేల టన్నులకు చేరనున్నది. బడ్జెట్ కూడా రూ. 30 కోట్ల నుంచి 40కోట్ల బడ్జెట్ తగ్గనున్నది. వచ్చే విద్యాసంవత్సరంలో 24.66 లక్షలు విద్యార్థులకు కోటికి పైగా ఉచిత పుస్తకాలు అందజేయాలని విద్యాశాఖ భావిస్తున్నది.
తరగతుల వారీగా అనుమతించిన బడి సంచి బరువు
తరగతులు కిలోలు
1 -2 1.5
3 -5 2 -3
6-7 4
8-9 4.5
10 5