హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. సొంత పిల్లలు, దగ్గరి బంధువుల పిల్లలు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే సమయంలో వారి తల్లిదండ్రులైన లెక్చరర్లను ఎగ్జామినర్ విధుల నుంచి మినహాయించాలని ఆదేశించింది. తమ వద్ద చదువుతున్న విద్యార్థులు ప్రాక్టికల్స్కు హాజరయ్యే చోట కూడా అలాంటివారిని ఎగ్జామినర్గా డ్యూటీ కేటాయించొద్దని పేర్కొన్నది. ఎగ్జామినర్ డ్యూటీ కేటాయించిన వారిని రిలీవ్ చేయని కాలేజీలపై రూ. 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకే యాజమాన్యం నిర్వహిస్తున్న కాలేజీల్లో మరో బ్రాంచి లెక్చరర్లను ఎగ్జామినర్గా విధులు కేటాయించడానికి వీల్లేదని స్పష్టంచేసింది.