హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 15: కాకతీయ యూనివర్సిటీలోని పోతన గర్ల్స్ హాస్టల్కు చెందిన ఎంబీఏ విద్యార్థిని బురఖా వేసుకున్న యువకుడితో కలిసి బైక్పై మంగళవారం రాత్రి 10గంటలకు హాస్టల్లోకి వచ్చింది. వారు మొదటి గేటు నుంచి రావడంతో అక్కడే ఉన్న కొందరు విద్యార్థిన్థులు గమనించి వెంబడించారు. హాస్టల్లోకి వె ళ్తుండగా వారిని అడ్డుకుని ప్రశ్నించగా మా ట్లాడలేదు. అనుమానం వచ్చి బురఖా తీయ గా యువకుడిగా తెలిసింది.
ఈ విషయాన్ని వెంటనే కేయూ హాస్టల్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు తెలుపగా.. ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. వారు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎంబీఏ విద్యార్థినిని వర్సిటీ అధికారులు మందలించి, ఆమెకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థిని భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారంరోజులపాటు సస్పెండ్ చేస్తామని హాస్టల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.