హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి ప్రతి గింజనూ కొనేందుకు చర్యలు చేపట్టాలని కోరా రు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఏప్రిల్ 6న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామన్నారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు శంషాబాద్లో సీపీఐ రాష్ర్ట మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.