న్యూఢిల్లీ, జనవరి 5: కరోనా యాంటి వైరల్ ఔషధం మోల్నుపిరావిర్తో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, అందుకే కొవిడ్ చికిత్స ప్రొటోకాల్లో చేర్చలేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ అన్నారు. డబ్ల్యూహెచ్వో, యూకే కూడా కరోనా చికిత్సలో దీన్ని చేర్చలేదని పేర్కొన్నారు. గర్భిణులకు మోల్నుపిరావిర్ ఇస్తే అది కడుపులో బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. అంతే కాకుండా కండరాలను బలహీనం చేస్తుందని పేర్కొన్నారు. కరోనా చికిత్సలో అత్యవసర పరిస్థితుల్లో మోల్నుపిరావిర్ను వాడుతున్నారు.