హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత రిపోర్టింగ్ గడువును అధికారులు పొడిగించారు. శనివారంతో ముగియనున్న గడువును ఈనెల 6 వరకు పొడిగించారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి మొత్తంగా 25,733 మంది విద్యార్థులు సీట్లు పొందగా, ఇప్పటివరకు 4,095 మంది రిపోర్టింగ్ చేయలేదు. వరుసగా సెలవులు రావడంతో విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 6 వరకు అవకాశం కల్పించారు. ఈ గడువులోగా విద్యార్థులు రిపోర్ట్ చేయకుంటే సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.