హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో), మేనేజ్మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీ కోసం ఈ నెల 22వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏదైనా డిగ్రీ పాసై, 2022 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించింది. వివరాలకు https:// ibps.in సంప్రదించాలని కోరింది.