హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయస్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిషారాల కోసం ఆర్బిట్రేషన్ సెంటర్ (మధ్యవర్తిత్వ కేంద్రం)ను హైదరాబాద్లో ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సింగపూర్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తరహాలోనే హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకోసం ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ మీనన్కు ప్రతిపాదన పంపినట్టు చెప్పారు. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి అన్ని వసతుల కల్పిస్తామని అన్నారు. ఈ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేస్తే తన కల సాకారమవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ అధికారి ఉంటారని చెప్పారు. మంగళవారం రాజ్భవన్ అతిథి గృహంలో హైకోర్టు లీగల్ రిపోర్టర్లతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్జాయతీయ స్థాయి కంపెనీలు (ఎంఎన్సీ) ఏర్పాటుకావడం ఒక ఎత్తు, వాటిలో తలెత్తే వివాదాలు సత్వర పరిషారం మరొక ఎత్తని, వివాదాలు వెంటనే పరిషారమైతేనే ఎంఎన్సీ సంస్థలు దేశంలో.. ప్రధానంగా ఉన్నత ప్రమాణాలున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని చెప్పారు. ఇలాంటి వివాదాలను సింగపూర్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లో పరిషారానికి ఎంఎన్సీ సంస్థలు వెళ్తున్నాయని వివరించారు. అకడికి వెళ్లేందుకు న్యాయవాదులకు భారీ మొత్తంలో ఫీజులు, ప్రయాణ ఖర్చులు, అంతర్జాతీయ ప్రమాణాలున్న హోటళ్లలో బసవంటివాటికి భారీగా ఖర్చు అవుతున్నదని తెలిపారు. అదే ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటుచేస్తే అవన్నీ ఇకడకే వస్తాయని చెప్పారు.
టెక్నాలజీలో మనమే టాప్
ప్రపంచంలోని అనేక కోర్టుల్లో లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సుప్రీంకోర్టులో వినియోగిస్తున్నామని సీజేఐ తెలిపారు. కేసుల సత్వర పరిషారానికి వినియోగిస్తున్న ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కావాలని సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మీనన్ కోరారని, ఆ సమయంలోనే హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనచేసినట్టు వివరించారు. జస్టిస్ మీనన్ ఆగస్ట్లో భారత్కు రానున్నారని, అప్పుడు ఆయనతో చర్చించి ఫలితం సానుకూలంగా వచ్చేలా కృషిచేస్తానన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కీలకమని తెలిపారు. అంతర్జాతీయ కోర్టు కేసుల్ని వాదించే న్యాయవాదులు వస్తే హైదరాబాద్లో బసచేసేందుకు అన్ని వసతులతో కూడిన హోటల్స్ ఉన్నాయని చెప్పారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలంటే దానిపై అప్పీల్ చేసేందుకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా రంగాల్లో అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తున్నదని, అలాంటి ఎంఎన్సీ కంపెనీల విదాదాలు ఎంత త్వరగా పరిషారమైతే అంతే వేగంగా హైదరాబాద్లో ఎంఎన్సీ కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీల్లో న్యాయ వివాదం తలెత్తితే వెంటనే పరిషారం కావాలని అవి కోరుకుంటాయని తెలిపారు. ఏదైనా కంపెనీ ఏర్పాటుచేయాలంటే ఇకడ న్యాయ వివాదం ఏర్పడితే ఎన్నాళ్లలోగా అవి పరిషారమవుతాయో ఆరా తీస్తున్నాయన్నారు. తాను సీజేఐ హోదాలో ఉన్నప్పుడే ఈ కలను సాకారం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
లైవ్ ఇస్తే బాగానే ఉంటుంది..
తీర్పుల ప్రతులు సుప్రీంకోర్టు తరహాలో అన్ని హైకోర్టుల్లోనూ వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేసే అంశంపై కసరత్తు జరుగుతున్నదని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఇందుకు సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. దీనివల్ల తీర్పు కాపీ అందలేదని చెప్పి జాప్యంచేయడానికి వీలుండదన్నారు.వాద ప్రతివాదులకు ఈమెయిల్ ద్వారా తీర్పు కాపీ పంపేందుకు వీలవుతుందని, తీర్పు ప్రతిని వెంటనే డౌన్లోడ్ చేసుకొనే వీలుంటుందని వివరించారు. కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు విచారణను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తున్నాయని, కేసుల అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రజాహిత వ్యాజ్యాలు వంటివి ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రతిపాదన ఉందన్నారు.
ఏకీకృత సర్వీసు రూల్స్ కేసును పరిష్కరించండి
సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీసురూల్స్ కేసును త్వరితగతిన పరిష్కరించాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం రాజ్భవన్లో సీజేను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ అప్పీల్ పెండింగ్లో ఉండటంతో ఎంఈవోలు, ఉప విద్యాధికారులు, బీఈడీ కాలేజీల లెక్చరర్లు, డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అవకాశం ఉండటం లేదని, అందువల్ల త్వరగా పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే?
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది కార్పొరేట్/వాణిజ్య సంస్థల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే మధ్యవర్తిత్వ వేదిక. వివిధ రంగాల్లో వాణిజ్య ఒప్పందాల్లో తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ఐఏసీని ఆశ్రయిస్తాయి. కోర్టు లిటిగేషన్కు, ఆర్బిట్రేషన్కు తేడా ఉన్నది. ఆర్బిట్రేషన్ అనేది ఇరు వర్గాలు తమ న్యాయవాదుల సమక్షంలో వివాద పరిష్కారానికి ప్రైవేట్గా సాగించే చర్చలు. తీర్పు ఇవ్వడానికి ఐఏసీలో ప్యానెల్ సభ్యులు ఉంటారు. సాధారణంగా అంతర్జాతీయ కార్పొరేట్ న్యాయనిపుణులు లేదా మాజీ న్యాయమూర్తులను ప్యానెల్ సభ్యులుగా ఉంటారు. కోర్టుల కంటే ఆర్బిట్రేషన్ ద్వారా వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయి. మనదేశంలో ఆర్బిట్రేషన్ను ‘ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్-2016’ ద్వారా నియంత్రిస్తారు. 18 నెలల్లో వివాదాన్ని పరిష్కరించాలని చట్టంలో గడువును నిర్దేశించారు. ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమైన న్యాయమూర్తిని నియమించుకోవచ్చు. న్యాయమూర్తి తీర్పును కట్టుబడి ఉండాలి. తీర్పును సాధారణ కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లండన్, హాంకాంగ్, సింగపూర్లలో ప్రముఖ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. వీటికి భారత్లోనూ పలు ప్రధాన నగరాల్లో కార్యాలయాలున్నాయి.