న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు హైదరాబాదీ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ అర్హత సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో చైనాలో జరుగనున్న ఏషియన్ గేమ్స కోసం జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య శనివారం జట్టును ప్రకటించింది. 36 మంది సభ్యులు గల ఈ జట్టులో తెలంగాణ యువ సంచలనం వ్రిత్తి చోటు దక్కించుకుంది. ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వ్రిత్తి.. తాజాగా హైదరాబాద్లోని గచ్చబౌలి వేదికగా జరిగిన సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్లోనూ రెండు పతకాలతో మెరిసింది. 12 మందితో కూడిన మహిళల బృందంలో వ్రిత్తి అగర్వాల్తో పాటు అనన్య నాయక్, మానా పటేల్, పాలక్ జోషి చోటు దక్కించుకున్నారు. పరుషుల విభాగంలో స్టార్ స్విమ్మర్లు సజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజన్తో పాటు మాజీ కాంస్య పతక విజేత విర్ధ్వాల్ ఖడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తం 36 మందిని ఎంపిక చేయగా.. అందులో 21 మంది స్విమ్మింగ్లో, ముగ్గురు డైవింగ్లో, 13 మంది వాటర్పోలోలో భాతర్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.