న్యూఢిల్లీ, మే 19 (నమస్తే, తెలంగాణ): సుప్రీంకోర్టు అధికారులు, సిబ్బంది తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్కు చెందిన న్యాయ విద్యార్థి నవీన్ శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ ఒకరోజు నిరసన చేపట్టారు.
మార్చి 29న సుప్రీంకోర్టులో తాను ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే ఇంతవరకు ఫైల్ నంబర్ ఇవ్వలేదని, ఈ విషయమై ఎన్నోసార్లు ఫోన్లు చేసినా, మెయిల్స్ పెట్టినా అధికారులు, సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ స్పందించి ఆ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని నవీన్ కోరారు.