ISB | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థ, హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సోమవారం విడుదలైన పైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్-2024లో దేశంలోనే టాప్-1 స్థానాన్ని నిలబెట్టుకున్నది. గ్లోబల్ ర్యాంకింగ్స్లో 31వ స్థానాన్ని కైవసం చేసుకున్నది.
నిరుడు అం తర్జాతీయ ర్యాంకింగ్స్లో 39వ ర్యాంక్లో నిలవగా, ఈ సారి తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానానికి ఎగబాకింది. 229 శాతం పెరుగుదలతో వార్షిక వేతన పెరుగుదల అంశంలో అంతర్జాతీ యంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రీసెర్చ్ ర్యాంకింగ్తోపాటు అలుమ్ని, పోస్ట్ పీజీపీ వేత నాలపరంగానూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. గ్లోబల్ రీసెర్చ్ ర్యాంకింగ్స్లో 52వ స్థానంలో నిలి చింది. అలుమ్ని నెట్వర్క్లో దేశంలో టాప్- బీ స్కూల్గా నిలవడమే కాకుండా, ఈ విషయంలో అంతర్జాతీయంగా 8వ ర్యాంక్ పొందింది.
ఐఐఎం అహ్మదాబాద్ జాతీయంగా రెండో ర్యాం క్, అంతర్జాతీయంగా 41వ ర్యాంక్, ఐఐఎం బెం గళూరు మూడోర్యాంక్, 47, ఐఐఎం కోల్కత్తా జాతీయంగా మూ డు, అంతర్జాతీయంగా 67, ఐఐ ఎం లక్నో జాతీయంగా నాలుగు, అంతర్జాతీయంగా 85, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జాతీ యంగా ఐదో, అంతర్జాతీయంగా 99వ ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సి ల్వేనియా, ప్రాన్సిస్, కొలంబియా బిజినెస్ స్కూల్ (యూఎస్), ఎస్డీఏ బకోని, ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్స్ వరుసగా వరల్డ్ టాప్ -5 బిజినెస్ స్కూ ల్స్లో జాబితాలో చోటు దక్కించుకున్నాయి.