మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
యాదాది, సెప్టెంబర్ 11: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 21వ శతాబ్దంలో దేశంలోనే గొప్ప నిర్మాణమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య అన్నారు. చినజీయర్స్వామి కనుసన్నల్లో, సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో మహాద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామివారి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.