రూ.15 లక్షల ఆస్తి నష్టం
గొల్లపల్లి, మే 30: పూజ దీపం పరదాకు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. ఇల్లు పూర్తిగా కాలిపోయి 15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన రేగొండ జగన్నాథం కిరాణం నడుపుతూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం జగన్నాథం షాపుకు వెళ్లగా అతని భార్య విజయలక్ష్మి దేవుడికి పూజ చేసి దీపం వెలిగించింది.
అనంతరం పక్కింటికి వెళ్లింది. గాలికి దీపం పక్కనే ఉన్న పరదాకు తగిలి మంటలు చెలరేగాయి. అగ్నికీలలకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. నిత్యావసరాలు, రూ.2.30 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యా యి. తాసిల్దార్ మధు ఘటన స్థలాన్ని సందర్శించారు. కుటుంబానికి 60 కిలోల బియ్యం అందించారు.