పటాన్చెరు, జూలై 26 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫె సర్ శాంతాసిన్హాతోపాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్కు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డీ.లిట్)ని ప్రదానం చేయనున్నట్టు గీతం యూని వర్సిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు మం గళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ హైదరాబాద్ 13వ స్నాతకోత్సవం సందర్భంగా వారిని సత్కరించనున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబా ద్లోని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోపన్యాసం చేయనున్నట్టు వెల్లడించారు. గీతం విశ్వవిద్యా లయ కులపతి ప్రొఫెసర్ వీరేందర్సింగ్ చౌహాన్ అధ్యక్షత జరిగే ఈ స్నాత కోత్సవంలో గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్ పాల్గొంటారని తెలిపారు. ఈ వేడుకలో 1,346 మంది విద్యార్థులకు పట్టాలు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.