హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించారు. సోమవారం సీఎం వైద్య, ఆరోగ్యశాఖపై ప్రగతి భవన్లో మంత్రి హరీశ్రావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు.