మానవపాడు, మార్చి 7 : బోరవెల్లిలో 1200 ఏండ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను కనుగొన్నామని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లిని ఆయన సందర్శించారు. బుర్జు వద్ద ఉన్న 8వ శతాబ్దం నాటి బాదామి చాళుక్యుల కాలానికి చెందిన చండి, చాముండి, చోళుల కాలానికి చెందిన గణపతి, నాగదేవత విగ్రహాల చరిత్రను ఆయన తెలియజేశారు. చెన్నకేశవ ఆలయం, మండపాల గురించి వివరించారు. వీరభద్రుడి ఆలయం సమీపంలోని దిగుడు బావిని నిజాం నవాబులు నిర్మించారని, ఇక్కడ ఉన్న రెండు ఫిరంగులు అలనాటి రక్షణ వ్యవస్థను తెలియజేస్తున్నాయని వివరించారు.