Hyderabad | హైదరాబాద్: హై స్పీడ్ యాక్సిడెంట్లు(High Speed Accidents) కామన్ అయిపోయాయి. టర్నింగ్ వద్ద ఓ కారు యమ వేగంగా దూసుకెళ్లింది. అయితే అదుపు తప్పిన ఆ కారు.. మార్నింగ్ వాక్(Morning Walk) చేస్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. షార్ప్ కర్వ్ ఉన్న ఆ ప్రాంతంలో ఎరుపు రంగు హోండా(ఏపీ09 బీజే2588) కారు దుమ్మురేపుతూ దూసుకు వచ్చింది. అయితే టర్నింగ్ వద్ద నడుచుకూంటూ వెళ్తున్న వారిపైకి వెళ్లింది. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని హైదర్ షా కోటే ప్రధాన రహదారిపై జరిగింది.
హైదరాబాద్ శివారులోని హైదర్షా కోట్ సన్ సిటీ వద్ద మంగళవారం తెల్లవారుజామున మార్నింగ్ వాకర్స్పైకి కారు వేగంగా దూసుకెళ్లడంతో.. తల్లీకూతురు అక్కడికక్కడే దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు pic.twitter.com/w0uNcSd6D9
— Namasthe Telangana (@ntdailyonline) July 4, 2023
కారు వేగంగా ఢీకొట్టడంతో బాధితులు సమీపంలోని చెట్ల పొదల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో ఓ తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అనురాధ(Anuradha), మమత(Mamata)గా గుర్తించారు. బాధితులు శాంతి నగర్ కాలనీకి చెందిన వారు గుర్తించారు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
— Namasthe Telangana (@ntdailyonline) July 4, 2023
కారులో మారణాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఈ ఘోర ప్రమాదం మంగళవారం ఉదయం 6:11 గంటలకు జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.