హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రుణ బకాయిల చెల్లింపు నిమిత్తం బ్యాంకర్లకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసగించినందుకు చెక్ బౌన్స్ కేసులను ఎదుర్కోవాల్సిందేనని దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) డైరెక్టర్లకు హైకోర్టు స్పష్టం చేసింది.
డీసీహెచ్ఎల్ దివాలా పరిషార ప్రక్రియలో భాగంగా రుణ పరిషారానికి నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతి ఇచ్చినా ఈ కేసును కొట్టివేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్తూ.. ఆ కంపెనీ డైరెక్టర్లు వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డి పిటిషన్లను కొట్టివేసింది. ఐబీసీ చట్టం కంపెనీలకే తప్ప వ్యక్తులకు రక్షణ కల్పించడం లేదని, అందువల్ల పిటిషనర్లు చెక్ బౌన్స్ కేసులను ఎదురోవాల్సిందేనని జస్టిస్ కే లక్ష్మణ్ తెలిపారు.