హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, జీవో నం. 55ను ప్రభుత్వం వెంటనే వెనకి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్రశాఖ కోరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ వినతిపత్రం అందజేశారు.
తెలంగాణలో ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమని తెలిపారు. దీనికి అనుబంధ వ్యవసాయ వర్సిటీలో పరిశోధనలు జరిగే ప్రదేశాన్ని హైకోర్టు నిర్మాణానికి అప్పగించడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే జీఓ 55ను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్, సిటీ సెక్రటరీ శ్రీకాంత్, స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్, పృథ్వీ తేజ, కళ్యాణి తదితరులు ఉన్నారు.