హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్, పీజీఈసెట్, ఈసెట్ వంటి ప్రైవేట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు సెట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జేఎన్టీయూలోని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నిర్ణయించింది. అందుకోసం ఒక ప్రత్యేక హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది.
ఇలాంటి ప్రవేశ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి? పరీక్షలకు ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి? కౌన్సెలింగ్కు ఎలా హాజరు కావాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఫోరం ఆధ్వర్యంలో హెల్స్లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని ఫోరం నాయకులు తెలిపారు. వివరాల కోసం దిలీప్ 7801009838, రాహుల్నాయక్ 9392868221 ఫోన్ నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.