హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బేగంపేట విమానాశ్రయంలో మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ మేడారం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. ఆదివాసీ గిరిజన దేవతలైన సమ్మక్క-సారమ్మలను దర్శించుకొనే భక్తుల సౌకర్యార్థం ఈ సేవలు ప్రారంభించినట్టు తెలిపారు. ముందస్తు బుకింగ్ కోసం 09880505905 టోల్ ఫ్రీ నంబర్ లేదా www.helitaxii.com వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు నడుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఎండీ మనోహర్రావు, ఏవియేషన్ డైరెక్టర్ భరత్రెడ్డి పాల్గొన్నారు.
హెలికాప్టర్ సర్వీసుల వివరాలు ఇలా..
చార్టర్ సర్వీసులు: కరీంనగర్, హైదరాబాద్ నుంచి మేడారం వరకు ఒక్కో వ్యక్తికి రూ.75 వే లు, మహబూబ్నగర్ నుంచి రూ.లక్ష చార్జి చేస్తా రు. ఒక్కో స్లాట్లో ఐదుగురిని జాతరకు తీసుకెళ్లి, వీఐపీ దర్శనం చేయించి తీసుకువస్తారు.
షటిల్ సర్వీస్: హనుమకొండ నుంచి మేడారం జాతరకు ఒక్కొక్కరికి రూ.19,999 చార్జి చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు స్లాట్లు ఉంటాయి. ఒక్కో స్లాట్లో ఐదుగురు ప్రయాణించవచ్చు.
జాయ్ రైడ్: 7 నుంచి 8 నిమిషాలు మేడారం జాతరను తిప్పి చూపిస్తారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.3,700 చార్జి చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు విరామం.
‘బుద్ధవనం’ వెబ్సైట్ ప్రారంభం
బుద్ధవనం ప్రాజెక్ట్ కోసం రూపొందించిన వెబ్సైట్ను మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రా రంభించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రాజెక్ట్ను ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు.