హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పత్రాలు ధ్వంసం అయ్యాయన్న కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు దాఖలు చేసిన కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్కుమార్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ కే సురేందర్ బుధవారం విచారించారు. రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని, పత్రాల ధ్వంసానికి పిటిషనర్కు సంబంధం లేదని, ఊహాజనితంగా కేసు పెట్టారని ఆయన న్యాయవాది వాదించారు. వాస్తవానికి కార్యాలయాన్ని సచివాలయానికి ఎప్పుడో తరలించారని, పత్రాల ధ్వంసానికి ఆసారమే లేదని చెప్పారు.