హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని ప్రముఖ కవి,సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శ్రీ నగర్ కాలనీలో గురువారం మొక్కల నాటారు. ఈ సందర్భంగా అశోక్ తేజ మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ని ఆకుపచ్చ చందమామగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం మరింత విజయం సాధించాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు. తాను రాసిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ వచన రూప కవిత్వం పుస్తకాన్ని ఎంపీ సంతోష్ కుమార్ కి బహుమతిగా పంపారు.