హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress government) మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉం టుందో తెలియదన్నారు. సోమవారం సిద్దిపేటలో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలకు మించి అధికారంలో ఉన్న రాష్ట్రాలు చాలా తక్కువ అని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సెల్ఫ్ గోల్స్తో ఐదు సంవత్సరాల కంటే ముందే అధికారం కోల్పోయిందని చెప్పారు. తెలంగాణ మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమేనని స్పష్టం చేశారు.
హరీశ్ రావు వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. ఓ వైపు కాంగ్రెస్లోని సీనియర్ నేతలు, కొంత మంది మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth reddy) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని నమ్మడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
అందుకు ప్రధాని మోదీని కలిసినప్పుడు సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండటమే ఇందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. అనిశ్చితికి మారు పేరైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుందో.. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియక దినదిన గడం నూరేళ్ల ఆయుష్షు లాగా పాలన సాగిస్తున్నది. ఇలాంటి తరుణంలో హరీశ్ రావు వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.