హైదరాబాద్, జూన్ 11: హ్యాపీ మొబైల్స్.. హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్ కొంపల్లిలో శనివారం నూతన స్టోర్ను తెరిచింది. ఈ 75వ స్టోర్ ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారుల కోసం ఎన్నో వినూత్న ఆఫర్లను తీసుకొచ్చింది. ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు, ల్యాప్ట్యాప్లు, మొబైల్స్పై క్యాష్బ్యాక్, డిస్కౌంట్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగానే రూ. 19,999లకే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ, మొబైల్ స్పెషల్ కాంబో ఆఫర్ను సంస్థ పరిచయం చేసింది. అలాగే రూ.9,999లకే 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ, రూ.67,900లకే ఐఫోన్ 13ను అందిస్తున్నది. అంతేగాక వన్ప్లస్ నార్డ్ సీఈ 2, ఒప్పో ఎఫ్19 ప్రో, వివో వీ21 5జీ మొబైల్స్పై ఆకర్షణీయ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. రూ.17,999లకే ల్యాప్ట్యాప్ ఇస్తున్న సంస్థ.. అన్ని మొబైల్ యాక్ససరీస్పై 65 శాతం వరకు తగ్గింపునిస్తున్నది. డౌన్పేమెంట్, ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీలు లేకుండానే రుణాలపై విక్రయాలుంటాయన్నది. అలాగే ఎక్సేంజీ ఆఫర్ల సౌకర్యాన్నీ కల్పించింది. కాగా, ఈ ఏడాది ఆఖరుకల్లా 100 స్టోర్లే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ సీఎండీ కృష్ణ పవన్ తెలియజేశారు.