Road Accident | కాజీపేట, డిసెంబర్ 1: వరంగల్ నగరం కాజీపేట పట్టణంలోని దర్గా రోడ్డులో భర్త బైక్పై ఎక్కబోతున్న మహిళను అతివేగంగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన గురువారం ఉద యం జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు శుక్రవారం ఫాతిమానగర్లో రాస్తారోకో చేసి, కాజీపేట ఠాణాను ముట్టడించారు. వివ రాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఫాతిమానగర్ శౌరీనగర్లో గెదె కవిత (38), జోసఫ్రెడ్డి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నారు. కవిత నగరంలోని ప్రైవేట్ దవాఖానలో నర్సుగా, జోసఫ్రెడ్డి ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. వీరి పిల్లలు జోషిత 8వ తరగతి, భావన 2వ తరగతి చదువుతున్నారు. గురువారం పోలింగ్ ఉండగా జోసఫ్రెడ్డి పనిచేసే పాఠశాలలోనే భార్యాభర్తలు ఓటేశారు.
తిరిగి ఇంటికెళ్లే క్రమంలో పాఠశాల గేట్ ఎదుట కవిత తన భర్త జోసఫ్రెడ్డి బైక్ ఎక్కుతుండగా ఫాతిమానగర్ నుంచి దర్గా కాజీపేటకు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. కొంత దూరం కారు ఆమెను అలా ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న భర్త జోసఫ్రెడ్డి వెంటనే బైక్ దిగి తీవ్రగాయాల పాలైన కవితను దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా కాజీపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఠాణా ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించిన బంధువులు, కుటుంబ సభ్యు లు.. ఫాతిమానగర్ బ్రిడ్జి వద్ద దాదాపు 2 గంటలకు పైగా రాస్తారోకో చేశారు.దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఓ యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరం.
తల్లిదండ్రుల్లారా..! మీ పిల్లల సంతోషం, సరదా కోసం వారికి వాహనాలను ఇవ్వొద్దు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకముందే వారికి వాహనాలను ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. వాహనాల విషయంలో పిల్లల మీద అతి ప్రేమ… pic.twitter.com/2Cet1zdJ3P
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 2, 2023
నిట్ కళాశాల, కాజీపేట చౌరస్తా వరకు దాదాపు బ్రిడ్జికి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీసీ భోజరాజు నేతృత్వంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సీఐలు సుజాత, సార్ల రాజు, మడికొండ సీఐ వేణు, ఎస్సైలతోపాటు నగర పోలీసులు దాదాపు నాలుగు గంటలు పాటు శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా టీఎస్ 03 ఎఫ్ఎ 9881 స్విఫ్ట్ డిజైర్ కారును గుర్తించామని, కారు అతివేగంగా నడిపి ప్రమాదానికి కారకుడైన దొడ్ల వంశీ భార్గవ్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వంశీభార్గవ్ తండ్రి శరత్కుమార్ వరంగల్ అర్బన్ ఎక్సైజ్ పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్నారు.