ఆర్మూర్, జూలై 24: గల్ఫ్లో పనిచేసే మనదేశ కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా గతేడాది తెచ్చిన రిఫరల్ వేజెస్ జీవోను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని ప్రవాస భారతీయ హక్కుల సంక్షే మ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాట్లాడారు. గతేడాది కేంద్రం తెచ్చిన రిఫరల్ వేజెస్ జీవో రద్దు కోసం టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు కే కేశవరావు, కేఆర్ సురేశ్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, బీబీ పాటిల్ పోరాడినట్టు ఆయన పేర్కొన్నారు.