హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శితమవుతున్న గాంధీ చలనచిత్రానికి విశేష స్పందన లభిస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 14న ప్రారంభమైన ఈ ప్రదర్శనలు 24 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 507 ప్రదర్శనలు నిర్వహించగా 2,06,220 మంది వీక్షించారని తెలిపారు. ప్రజల నుంచి విశేష ఆదరణ ఉన్నందున విద్యార్థులకే కాకుండా సామాన్య ప్రేక్షకులకూ ఉచితంగా అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రదర్శిస్తున్నారు.