హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. గవర్నర్కు అక్కడ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆమెకు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రయాన్-3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని, ఆదిత్య ఎల్-1 విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్టు గవర్నర్ తెలిపారు.