హైదరాబాద్: కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్ను కోల్పోయిందని చెప్పారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి క్లాసిక్ చిత్రాలు రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. దర్శక రుషి కళ చిరస్థాయిగా నిలిచిపోతుందున్నారు. ఈమేరకు గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.