హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థిత్వానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. వారి ఫైల్పై శనివారం సంతకం చేశారు. దీంతో ఎమ్మెల్సీ పదవులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు మంత్రి అజారుద్దీన్కు పదవీ గండం తప్పింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగానే వీరు ఎమ్మెల్సీలుగా ఖరారవుతారని న్యాయ నిపుణు లు పేర్కొంటున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెం డింగ్ ఉన్నది. ఈ కేసు జూలై 22కు వా యిదా పడింది. బీఆర్ఎస్ సర్కార్ హ యాంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్ర వణ్ను నామినేట్ చేసి ప్రతిపాదనలను గవర్నర్కు పంపించింది. వీరిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో వారి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారి స్థానంలో కోదండరాం, అమీ ర్ అలీఖాన్ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరికి గవర్నర్ ఆమోదం తెలిపా రు.
దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై వి చారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్అలీఖాన్ అభ్యర్థిత్వాలను నిలుపుదలచేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడే కొత్త ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవచ్చని న్యాయస్థా నం స్పష్టంచేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం గతంలో ఉన్న అమీర్అలీఖాన్ పేరును తొలగించి కోదండరాంతోపాటు అజారుద్దీన్ పేరును ప్రతిపాదించింది. ఈ అభ్యర్థిత్వాలకు గవర్నర్ తాజాగా అమోద ముద్ర వేశారు. గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్కు రాజకీయ నేప థ్యం ఉందనే కారణంతో వారి అభ్యర్థిత్వాలను నాటి గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ పక్కన పెట్టగా, ఇప్పుడు తెలంగాణ జన సమితి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంత్రిగా ఉన్న అజారుద్దీన్ అభ్యర్థిత్వాలకు నేటి గవర్నర్ శివప్రతాప్శుక్లా ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిది రాజకీయ నేపథ్యం కాదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసు ప్రకారం వీరిద్దరికి కూడా పదవీ గండం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.