హైదరాబాద్ : జేఎన్టీయూకు దేశంలోనే మంచి పేరుందని రాష్ట్ర తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివారం జేఎన్టీయూహెచ్ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు. ఉత్సవాలు ఏడాది పాటు కొనసాగనున్నాయి. 50 సంవత్సరాల్లో జేఎన్టీయూహెచ్ ఎన్నో మైలురాళ్లు, ప్రత్యేకతలు సాధించింది. స్వర్ణోత్సవాలు ప్రారంభించిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశంలోనే తొలి టెక్నాలజీకల్ జేఎన్టీయూహెచ్ అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటీ సాంకేతికపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
ఇందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ యూనివర్సిటి పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారన్నారు. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పూర్వ విద్యార్థులంటే భావితరాలకు ఆస్తి అని, వారందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధింవచ్చని పేర్కొన్నారు. దేశంలోనే జేఎన్టీయూహెచ్కు మంచి పేరుందని వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. అనుభవిజ్ఞులైన అధ్యాపకులతోనే ఇది సాధ్యమైందన్నారు. స్వర్ణోత్సవాలు ఏడాది పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.