విడుదల చేసిన విజయ ఆయిల్స్
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ విజయ ఆయిల్స్ ‘కిన్నెర’ పేరుతో వాటర్ బాటిల్స్ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 3 కోట్లతో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఇతర బ్రాండ్లకు భిన్నంగా అన్నిరకాల పోషకాలు గల నాణ్యమైన మంచినీళ్లను వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్టు ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అరలీటర్ బాటిల్ ధరను రూ. 10గా, లీటర్ బాటిల్ ధరను రూ. 20గా నిర్ణయించారు.