హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ -దోమల్గూడ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బీపీఈడీ, యూజీ డీపీఈడీ వంటి కోర్సులను నిర్వహిస్తున్న ఈ కాలేజీ భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది.
ఈ మేరకు జీవో -136ను జారీచేసింది. భవన నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు.