హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ) : డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గోవర్ధన్ (జీకే దేశ్పాండే) గురువారం ఎన్నికయ్యారు. ఒక్క ఓటుతో తన ప్రత్యర్థి బీ సంజయ్కుమార్(23 ఓట్లు)పై గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్గా ఎన్వీ సుబ్బరాజు, జనరల్ సెక్రటరీగా డీ రాఘవులు, జాయింట్ సెక్రటరీగా కే కల్యాణ్ చక్రవర్తి, కోశాధికారిగా జీఏ కిరణ్రాజ్ ఎన్నికయ్యారు.