వనపర్తి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరికలను నిరసిస్తూ ఓ నాయకుడు ఏకంగా ఎమ్మెల్యే ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన వనపర్తి నియోజకవర్గం లో కలకలం రేపింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సైతం బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల ను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నా రు. అయితే గోపాల్పేట మండ లం తాడిపర్తి గ్రామంలో గురువారం సాయం త్రం బీఆర్ఎస్కు చెందిన నాయకులను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్ఎస్ నేతలు తమపై కేసులు పెట్టి అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని, అందుకే వారిని పార్టీలో చేర్చుకోవద్దని గోపాల్పేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ్రాతి గణేశ్గౌడ్ పార్టీ పెద్దలకు సూ చించారు. గణేశ్గౌడ్ మాటలను వారు వినకపోగా చేరికల వివరాలు వెల్లడించక పోవడం తో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై గురువారం ఉదయం వనపర్తిలోని ఎమ్మెల్యే సొంత క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొన్నారు. నిప్పంటించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డికి అగ్గిపెట్టి ఇచ్చారు. తాను పార్టీని వ్యక్తిగతంగా ఉపయోగించుకోలేదని, గోపాల్పేట మండలానికి చెందిన మరో నాయకుడు సత్యశీలారెడ్డి ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్నాడని గణేశ్ ఆవేదన చెందారు. న్యాయం జరగడం లేద నే బాధతో పెట్రోల్ పోసుకున్నట్టు చెప్పారు. మేఘారెడ్డిపై చిన్నారెడ్డి వర్గీయుడు గణేశ్గౌడ్ పెట్రోల్తో దాడికి ప్రయత్నించాడని ప్రతిగా కొందరు సోషల్ మీడియాలో మెస్సేజ్లు పెట్టారు. పైకి బాగానే కనిపిస్తున్నా నియోజక వర్గంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి వర్గాలు బాహాటంగానే గొడవలకు దిగుతుండటంతో పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు.