వాణీదేవి గెలుపుతో సర్వత్రా హర్షం
జిల్లా అంతటా సంబురాలు చేసుకున్న పార్టీ శ్రేణులు
పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసిన కార్యకర్తలు
నాగర్కర్నూల్ టౌన్/ కందనూలు, మార్చి 20: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపొందడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు మొదటయ్యాయి. వాణీదేవి గెలుపుపై తెలంగాణ కాంట్రాక్టు లెక్చర్లర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, వైస్చైర్మన్ బాబురావు, జెడ్పీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిమ్మాజిపేటలో సంబురాలు
తిమ్మాజిపేట, మార్చి 20: అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు స్వామి, గుమ్మకొండ సర్పంచ్ సత్యంయాదవ్, శ్యాం, ప్రశాంత్, బెక్కరి రాజు పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
వంగూరు, మార్చి 20: టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపుపై ఎంపీపీ భీమమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల నరేందర్రావు, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గణేష్రావు శనివారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
చారకొండలో..
చారకొండ, మార్చి 20: వాణీదేవి విజయం సాధించడంపై జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్ హర్షం వ్యక్తం చేశారు. వాణీదేవికి ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కల్వకుర్తిలో..
కల్వకుర్తి, మార్చి 20: వాణీదేవి గెలుపుతో కల్వకుర్తిలో సంబురాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సంబురాల్లో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, టీఆర్ఎస్ నాయకులు విజయ్గౌడ్, బాలయ్య, పీఆర్టీయూ నాయకులు సురేందర్రెడ్డి, బోజిరెడ్డి, మనోహర్రెడ్డి పాల్గొన్నారు.
బిజినేపల్లిలో..
బిజినేపల్లి, మార్చి 20 : మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. సంబురాల్లో ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, బాలస్వామి, పులేందర్రెడ్డి, పర్వతాలు, కృష్ణ, మల్లేశ్, శ్రీను, వెంకన్న, మహెమూద్ ఉన్నారు.
తెలకపల్లిలో..
తెలకపల్లి, మార్చి 20: మండలకేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమంతురావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాములు, కోట్ల శ్రీనివాసులు, సత్యనారాయణ, నర్సింహ, భాస్కర్రెడ్డి, సాగర్రావు, పర్వతాలు పాల్గొన్నారు.
వెల్దండలో..
వెల్దండ, మార్చి 20: మండలకేంద్రంలోని బస్టాండ్ వద్ద నాయకులు సంబురాలు జరిపారు. సంబురాల్లో బండోన్పల్లి సర్పంచ్ అంజయ్య, ఉపసర్పంచులు నిరంజన్, నర్సింహ ముదిరాజ్, టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ గోపాల్నాయక్, వార్డుసభ్యులు రాము, జహేదా, మండల నాయకులు యాదగిరి, కృష్ణారెడ్డి, ప్రభాకర్, శేఖర్, సమీర్బాబ, దే వేందర్, మల్లయ్య, కృపానందం, నిరంజన్ ఉన్నారు.