ఆదిలాబాద్ : బీంపూర్ మండలంలోని గొల్లగడ్ గ్రామస్తులు ఈసారి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మొత్తం గ్రామంలో ఒక్కరూ కూడా పోలింగ్ బూతువరకు వచ్చి ఓటెయ్యలేదు. దీంతో ఎన్నికల అధికారులు ఖాళీ డబ్బాలతో తిరుగుముఖమయ్యారు. తమ గ్రామాన్ని ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని, రాజకీయ నేతలపై తమకు నమ్మకం లేదని గ్రామస్తులు ఓటు వేయలేదు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలను విని పరిష్కారానికి హామీ ఇస్తే ఓటు వేస్తామని తెగేసి చెప్పారు. జిల్లా కలెక్టర్ ఫోన్లో మాట్లాడినా ఫలితం లేక పోయింది.
బీంపూర్ మండలంలోని గొల్లగడ్ గ్రామం థాంసీ నుంచి వేరువడి కొత్తగా ఏర్పడ్డ పంచాయతి. మండలంలో మొత్తం 26 గ్రామాల్లో గొల్లగడ్ ఒకటి. ఈసారి కూడా ఈ మండలంలో 80 శాతం ఓటింగ్ దాటే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.