హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, మినిమం టైమ్స్కేల్ ఇప్పించాలని తెలంగాణ సమగ్ర సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం నేతలు బుధవారం మంత్రి ధనసరి అనసూయ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుండిగల్ యాదగిరి, ఉపాధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, అధికార ప్రతినిధి పడాల రవీందర్, మాధవ్, నాగార్జున, రాజు, పాషా తదితరులు పాల్గొన్నారు.