హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రధాన అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మినీ అంగన్వాడీ టీచర్లకు అవకాశం ఇవ్వాలని మినీ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఆమె రాష్ట్ర స్త్రీ, సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ను కమిషనరేట్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.