రంగారెడ్డి, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలోని రంగసముద్రం చెరువును పరిరక్షించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో, ప్రజా భవన్లోని ప్రజావాణిలో రైతు సంఘం నేతలు ఫిర్యాదులు చేయగా.. బుధవారం రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. చెరువు ఆక్రమణలకు గురికావడంతో భూగర్భజలాలు అడుగంటి ఈ ప్రాంత రైతాంగం సాగు పరంగా ఇబ్బందులు పడుతున్నదని రైతు సంక్షేమ సంఘం నేతలు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.