హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు హియరింగ్ మిషన్ అవసరమైంది. విషయం తెలుసుకున్న సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్రెడ్డి ఇందుకు అవసరమైన ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ ద్వారా అందించాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అర్చనకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. రాజేశ్వర్రెడ్డిని కేటీఆర్ అభినందించారు.