హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్షలు 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఐఐఎస్సీ బెంగళూరు వెల్లడించింది. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నది. రాష్ట్రంలోని పలుచోట్ల పరీక్ష నిర్వహిస్తారు.
2024 మార్చి 16న పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది కొత్తగా డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ను చేర్చారు. వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.