హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్గా గ్యారెత్ విన్ ఓవెన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూకే-ఇండియాల మధ్య సంబంధాల అభివృద్ధిలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.