హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, హైదరాబాద్లోనూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. మంగళవారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తన పుట్టిన రోజున విద్యార్థులతో గడపటం చాలా ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు.