హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తొలి ప్రయత్నంలోనే నీట్ సాధించే అంశంపై జూన్ 3, 4, 5న ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామైండ్ అకాడ మీ డైరెక్టర్ మనోజ్కుమార్ తెలిపారు. ఈ తరగతుల పోస్టర్ను చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.
మనోజ్కుమార్ మాట్లాడుతూ, నీట్ ర్యాంకర్లు, సీనియర్ అధ్యాపకులు, విషయ నిపుణులు నీట్పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. వివరాలకు దోమలగూ డ రామకృష్ణమఠం పక్కన గల తమ అకాడమీలో సంప్రదించాలన్నారు.